పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 లక్షల 38 వేల రూపాయల బంగారు ఆభణాలు, ఐదు మోటా రు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. భీమవరం వన్టౌన్ పోలీసుస్టేషన్లో మంగళవారం విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. కాళ్ల మండలం సీసలిలోని ముగ్గుళ్ల నర్సింహారావు ఇంటిలో దొంగతనానికి పాల్పడిన అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంకు చెందిన జొన్నల వెంకటేశ్, కాళ్ల మండలం బొండాడపేటకు చెందిన ఆకురాతి జోష్ణదేవితోపాటు భీమవరంలోని అట్టిక గోల్డ్ కంపెనీలో పనిచేస్తున్న పాలకొల్లుకు చెందిన గొర్రెల కృష్ణలను అరెస్టు చేశామన్నారు. నిందితులను ఆకివీడు సీఐ వి.జగదేశ్వరరావు, ఎస్ఐ నాళం శ్రీనివాసరావు విచారించగా జొన్నల వెంకటేష్, ఆకురాతి జోష్ణ దేవి జిల్లాలోని ఉండి, పెంటపాడు, తణుకు రూ రల్, తాడేపల్లిగూడెం రూరల్, ఏలూరు జిల్లాలో ని లక్కవరం, తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల ప్రాంతంలో బంగారు గొలుసులు దొంగతనాలకు పాల్పడ్డామని తెలిపారన్నారు. కాళ్ళ, ఉండ్రాజవరం, ముదినేపల్లి పరిధిలో మోటారు సైకిళ్లను దొంగతనం చేశారన్నారు. జొన్నల వెంకటేశ్ ఆటోలు, బస్సులు కోసం ఒంటరిగా వేచి ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసు కుని వారికి మోటారు సైకిల్పై లిప్ట్ ఇచ్చి వారి మెడల్లోని బంగారు ఆభరణాలు దొంగిలించే వాడన్నారు. నిందితులు వెంకటేశ్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.70 వేలు. జోష్ణదేవి ఖాతాలో రూ.1.80 లక్షలు సీజ్ చేశామన్నారు. ఈ కేసులో అట్టిక గోల్డ్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. కేసును ఛేదించిన సీఐ జగదీశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబు ళ్లను అభినందించి నగదు రివార్డులను అందిం చారు. సమావేశంలో డీఎస్పీ ఆర్.జయసూర్య, ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa