ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 1న కొవ్వూరులో పర్యటించనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:54 PM

ఫిబ్రవరి ఒకటో తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ఏన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. కొవ్వూరు టౌన్‌,మండలంలోని దొమ్మేరు గ్రామాల్లో మంగళవారం స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఆరికిరేవుల రోడ్‌లోని స్పెక్‌ కాలనీ లేఅవుట్‌, కొవ్వూరుటౌన్‌ పరిధిలోని సీఎన్‌జీ గ్యాస్‌ బంకు వెనుక ప్రైవేటు లేవుట్‌, గామన్‌బ్రిడ్జి వద్ద లే అవుట్‌, దొమ్మేరు పెట్రోల్‌ బంకు వద్ద ప్రైవేటు లే అవుట్‌, దొమ్మేరు గ్రామంలో క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటించారు.అనంతరం కొవ్వూరు, దొమ్మేరు గ్రామాల్లో ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.రాజబాబు పర్యటించారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఖరారు చేసి వెల్లడించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన ఖరారైందన్నారు. పర్యటనను అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌, జేసీ ఎస్‌.చిన్నరాముడు,ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, సూరపనేని చిన్ని, కలగర సుబ్బారావు, గారపాటి రామకృష్ణ, హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ కె.భాస్కరరావు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత,డీఎస్పీ జి.దేవకుమార్‌, తహశీల్దార్‌ ఎం. దుర్గాప్రసాద్‌, ఎంపీడీవో కె.సుశీల, కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, పట్టణ సీఐ పి.విశ్వం, ఎస్‌ఐలు కె.జగన్మోహనరావు, కె. శ్రీహరిరావు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa