ప్రముఖ టెలికాం సంస్థ జియో రెండు పాప్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది. వాయిస్ ఓన్లీ ప్లాన్ల కోసం ట్రాయ్ ఆదేశాల మేరకు ఇటీవల రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చిన జియో.. ఇప్పుడు రెండు పాత ప్లాన్లను తొలగించింది. దీంతో ఇప్పటివరకు అందిస్తున్న రీఛార్జి ప్లాన్లు రూ. 189, రూ. 479 ఇకపై యూజర్లకు అందుబాటులో ఉండవు. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తన అధికారిక వెబ్సైట్ నుంచి పూర్తిగా తీసేసింది. కాగా, గతంలో రూ. 189 రీఛార్జి ప్లాన్లో కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు లభించేవి. అలాగే 2జీబీ డేటా కూడా ఈ ప్లాన్తో వచ్చేది. తక్కువ డేటా ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జి ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు రూ.479 రీఛార్జి ప్లాన్ 84 రోజుల గడువుతో అందుబాటులో ఉండేది. దీని ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, 1000 ఎస్సెమ్మెస్లు, 6జీబీ డేటా లభించేవి. వాల్యూ ప్లాన్స్గా వీటిని పేర్కొనేవారు. ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. రూ. 458, రూ. 1,958 ప్లాన్లను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్లను పొందవచ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు. అదేవిధంగా రూ.1,958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. ఇందులో కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa