గత ఐదేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన వైయస్ జగన్ దేశంలోనే టార్చ్బేరర్గా నిలిచారని, అది చూసి ఓర్వలేక ఆయన ప్రతిష్టను మసకబార్చడమే లోకేష్ పనిగా పెట్టుకున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుళ్లు కుతంత్రాలతో అసర్ రిపోర్టును లోకేష్ తారుమారు చేశారని ఆక్షేపించారు. తండ్రీ కొడుకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా వైయస్ జగన్ గొప్పదనాన్ని, విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను విద్యాశాఖ వెబ్సైట్తోపాటు కేంద్ర నివేదికలు రుజువు చేస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రుల్లో ఎవరిని అడిగినా పిల్లల చదువుల కోసం వైఎస్ జగన్ తపించిన వైనాన్ని వివరిస్తారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa