భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ర్టేషన్ ఛార్జీల ధరలూ పెర గనున్నాయి. ఇప్పటికే భూముల విలువలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం వరకు, విలువ తక్కువగా వున్న ప్రాంతాల్లో 20 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల వారీగా పెరిగిన వివరాలను జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో అన్లైన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ఆస్తులకు అనుగుణంగా కొత్త లెక్కల ప్రకారం రిజిస్ర్టేషన్లు చేయనున్నారు.వైసీపీ ప్రభుత్వం నాలుగుసార్లు భూముల విలువను పెంచింది. 2020 ఆగస్టులో, 2022 ఫిబ్రవరిలో, ఏప్రిల్లో భూముల ధరల్ని పెంచగా, 2024 జూన్ 1 నుంచి కూడా పెంచుతున్నట్లు ఆదేశాలిచ్చింది. 2021 లో కరోనా కారణంగా పెంపు జోలికి వెళ్లలేదు. మిగిలిన ప్రతిసారీ 10 నుంచి 40 శాతం వరకు పెంచింది. వైసీపీ ఇష్టానుసారంగా భూముల ధరల్ని పెంచేయడంతో క్రయ విక్రయదారులపై పెనుభారం పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం 10-20 శాతం మధ్యలో పెంపుదలను పరిమితం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa