మీడియాపై గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ హెచ్చరించారు. తప్పు చేస్తే రాయాలని.. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానన్నారు. భూ అక్రమాలు చేశానని చెబుతున్నారని.. వాటిని నిరూపించాలని.. లేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతా అని గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. ‘‘ మీడియా అంటే నాకేమీ లెక్కలేదు. అన్ని విధాలుగా చేసొచ్చా. రాస్కోండి. నేను తప్పు చేయను’’ అని స్పష్టం చేశారు.
తప్పు చేస్తే మాత్రం బహిరంగంగా నిలదీయండి. కానీ నేను తప్పు చేయకపోయినా.. నా తమ్ముడు తప్పు చేశాడు... ఇంకెవరో తప్పు చేశారని అనొద్దు. తప్పు చేస్తే నేరుగా అడగండి. తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను కూడా. తప్పులు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఎవరైనా నాపై రాసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలి. నేను కబ్జా చేస్తే తలదించుతా.. చేయకపోతే తలఎత్తుతా’’ అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మీడియాను ఉద్దేశించి గుంతకల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మీడియాపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa