ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త సోనూ సూద్ అమరావతిలోని ఏపీ సచివాలయానికి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. సోనూ సూద్ రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వనున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ ఈ అంబులెన్స్ లను అందించనుంది. కాగా, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి నేరుగా ఆయన సచివాలయానికి బయల్దేరారు.