ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, వసతి దీవెన, విద్యాదీవెన, చేయూత, ఆసరా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం.. ఇలా గతంలో ఉన్న అన్ని పథకాలు కూటమి ప్రభుత్వంలో పక్కకు పోయాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
9 నెలల్లోనే ఏకంగా లక్షా 40 వేల కోట్లపైనే అప్పులు చేశారని.. ఇన్ని అప్పులు చేసినా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏవి కొనసాగడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.