విశాఖలో కాలేజీ బస్సు ఢీకొని ఓ యువ ఇంజనీర్ మృతి చెందాడు. కొత్తపాలెం ఆదర్శనగర్ కు చెందిన ఉమ్మి ఆదినారాయణ ఓ కార్పెంటర్. ఆయనకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు వెంకట బాలాజీ (26) ఇంజనీరింగ్ పూర్తిచేసి షిప్ యార్డ్ లో అప్రెంటీస్ గా పనిచేస్తున్నాడు. గురువారం విధులకు వెళుతుండగా గోపాలపట్నంలో రఘు ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు.