శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒక్కటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిని ఈ నెల 12న నిర్వహించునున్నారు. ప్రతిఏటా మకర మాసంలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు.
![]() |
![]() |