టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా భారత్ ప్లేయర్లకు బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.125 కోట్ల ప్రైస్ మనీని అందించింది. ఐతే, ఈ ప్రైజ్ మనీతో పాటు తాజాగా మరో విలువైన బహుమతిని కూడా ప్లేయర్లకు అందించింది. గెలిచిన టీమ్లోని ప్రతి ఆటగాడికి అత్యంత విలువైన డైమండ్ రింగ్స్ను ప్రదానం చేసింది. అమెరికన్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటి నుంచి స్ఫూర్తి పొంది బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే బీసీసీఐ.. నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ప్లేయర్లకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వజ్రపు ఉంగరాలను ప్రదానం చేసింది. తాజాగా ఈ ప్రదానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.
Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup
Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever #NamanAwards pic.twitter.com/SKK9gkq4JR
— BCCI (@BCCI) February 7, 2025