ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పట్టుమని పది రోజులు కూడా లేదు. అన్ని జట్లు టైటిల్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. రెండుసార్లు ఛాంపియన్స్గా నిలిచిన టీమిండియా కూడా ఈసారి ట్రోఫీ అందుకోవాలని ఎదురుచూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియా తరఫున బెస్ట్ బౌలింగ్ వేసిన వారిని ఓసారి చూద్దాం.
టీమిండియా తరఫున ఒక ఇన్నింగ్స్లో బెస్ట్ బౌలింగ్ చేసిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా టాప్లో ఉన్నాడు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రవీంద్ర జడేజా వెస్టిండీస్పై పది ఓవర్లు వేసి కేవలం 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. జడేజా తర్వాత సచిన్ టెండూల్కర్ 1998లో ఆసీస్పై 9.1 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుని సెకండ్ ప్లేస్లో నిలిచాడు.
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ జింబాబ్వేపై 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు వికెట్లు పడగొట్టగా, ఆసీస్ నెహ్రా పాకిస్తాన్పై 2009లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్, రమేష్ పవార్, వీరేంద్ర సెహ్వాగ్, బీకేవీ ప్రసాద్, హర్బజన్ సింగ్ మూడు మూడు వికెట్లు తీసుకున్నారు.
ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఎక్కువ వికెట్లు తీసుకున్నది కూడా రవీంద్ర జడేజానే. పది ఇన్నింగ్స్లలో 16 వికెట్లతో జడేజా టాప్లో ఉండగా, జహీర్ ఖాన్ 15, సచిన్ టెండూల్కర్ 14, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ 13 వికెట్లు తీసుకున్నారు.
![]() |
![]() |