శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసలో పదేళ్ళ యువంత్ మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్ కు గురైతే.
పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడి అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత, మనోనిబ్బరం ఆదర్శనీయం అని చంద్రబాబు 'X' వేదికగా తెలిపారు. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ.. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
![]() |
![]() |