తిరుపతి నగరంలో మోహన్ బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. ఆయన విద్యాసంస్థల దగ్గర ఉన్న ఓ రెస్టారెంట్ ను బౌన్సర్లు ధ్వంసం చేశారు. యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులు టీ తాగేందుకు హోటల్కు వెళ్లి తిరిగి వస్తుండగా బ్యాగ్ తగిలి టీ సాసర్, కప్పులు పగిలిపోయాయి. అయితే డబ్బులు చెల్లిస్తున్న విద్యార్ధులను రెస్టారెంట్ సిబ్బంది దుర్బాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు విద్యా సంస్థలకు చెందిన బౌన్సర్లు రెస్టారెంట్కు వెళ్లి.. యాజమాన్యంతో గొడవపడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హోటల్ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు హోటల్ వద్దకు చేరుకున్నవారిపై కూడా బౌన్సర్లు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మరికాసేపట్లు రెస్టారెంట్ వద్దకు రానున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి.. వారితో మాట్లాడి.. హోటల్ నిర్వాహకులకు ఆర్థికంగా సాయం చేయనున్నట్లు సమాచారం. అలాగే హోటల్ యాజమాన్యానికి ధైర్యం చెప్పి.. వారికి అండగా నిలబడతానని చెప్పే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa