ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న నలవీరగంగాభవానీ జాతర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 02:40 PM

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా ప్రసిద్ధికెక్కిన మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం(సీటీఎం)లో వెలసిన నలవీరగంగాభవానీ జాతరకు ఆలయకమిటీ సభ్యులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర జరుగనుంది. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి మరుసటి రోజు నుంచి జాతర నిర్వహిస్తారు. సీటీఎం, సీటీఎం క్రాస్‌, కొత్తవారిపల్లె, దుబ్బిగానిపల్లె, పోతబోలు గ్రామాల్లోని 120 పల్లెల్లో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. జాతరకు గ్రామాల్లోని ప్రజలు, భక్తులే కాకుండా పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కదిరి జిల్లాలల నుంచే అధిక సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. ఆలయా న్ని గత ఏడాదే రూ. కోటికిపైగా ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేశారు.


జాతరలో చాందినీబండ్లు ప్రత్యేక అలంకరణగా నిలుస్తాయి. దాదాపు 300 ఏళ్ల కిందట సీటీఎం పరిసరప్రాంతాల్లో వరదలు వచ్చి గ్రామాలకు ముం పు ఏర్పడింది. గ్రామ ప్రజలు ఊరు పొలిమేరలోని అమ్మవారిని కాపా డాల ని మొక్కుకున్నారు. గంగమ్మ గ్రామంలోకి వరద ముప్పు రాకుండా అడ్డు కుందని గ్రామస్థుల నమ్మకం. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏటా అమ్మవారి జాతరను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa