ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణం అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 09:51 AM

మధ్యభారతం మీదుగా వీచిన పొడిగాలులతో రాష్ట్రంలో ఆదివారం ఎండ ఠారెత్తించింది. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతీవ్రతతో వాతావరణం వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదైంది. కోస్తాలో పలుప్రాంతాల్లో ఉదయంపూట పొగమంచు కురిసింది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో రాత్రిపూట చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా పొగమంచు కురుస్తుందని, కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa