ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 12:59 PM

గోదావరి నది గత పుష్కరాలకు భక్తుల రద్దీని ముందుగానే ఊహించి పనులు చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తలేదు. 2027 జూలైలో పుష్కరాలకు కూడా ప్రభుత్వం అధికార యత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. మంత్రి నారాయణ మూడు పర్యాయా లు రాజమండ్రిలో అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ నాగరాణి నరసాపురం ప్రాంతంలో చేపట్టాల్సిన పనులపై సమీక్ష నిర్వహించి ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. కొన్ని శాఖలు మొద్దు నిద్ర వీడలేదు. స్నానాల రేవులు, లైటింగ్‌, డ్రసింగ్‌రూమ్‌, రోడ్లు, రవాణ సౌకర్యం, వసతి, ఆలయాల దర్శనంపై ఏ పనులు చేపట్టాలి, అంచనా వ్యయం ఎంత, తదితర ప్రతిపాదనలు వివిధ శాఖలు అందించాల్సి ఉంది. ఇంతవరకు కొన్నిశాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. 2015లో గోదావరి పుష్కరాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.200 కోట్ల పనులకు ఆమోద ముద్ర వేసింది. పురపాలక సంఘానికి సంబంధించి రూ.70 కోట్లు ఉన్నాయి. తరువాత ఆర్‌అండ్‌బి రెండో స్థానంలో నిలిచింది. దాదాపు రూ.50 కోట్ల పనులకు అనుమతి లభించింది. ఆ పుష్కర పనుల్లోనే నరసాపురం– మత్స్యపురి రహదారి రూ.25 కోట్లతో ఆభివృద్ధి చేశారు. పంచాయితీరాజ్‌ చేపట్టిన పనుల్లో చిన మామిడిపల్లి నుంచి పాలకొల్లు మండలం దిగమర్రు వరకు కాల్వ రోడ్‌ ఉంది. పురపాలక ఏటిగట్టును మార్బుల్స్‌తో సుందరీకరించింది. ట్రాన్స్‌కో చేపట్టిన పనుల్లో రెండు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. పట్టణ, మండలాల్లో లోవోల్టేజ్‌ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. శిఽథిలావస్థకు చేరిన ఆలయాలకు కొత్త రూపు వచ్చింది. పట్టణంలో మూడు స్నానాల రేవులు మాత్ర మే ఉండేవి. స్నానాల రేవు సంఖ్య పెరిగింది. వలంధర్‌ రేవుకు ఆర్చి ఏర్పడింది. పురపాలకంలో తాగునీటి సమస్య లేకుండా 11 కిలో మీటర్ల మేర ఓహెచ్‌ఆర్‌లను కలుపుతూ పెద్ద పైప్‌లైన్‌ ఏర్పాటుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa