నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్ మాగుంట సుబ్బరామిరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ను నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు.ప్రజల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ నెల్లూరు పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. జాకీర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ పార్క్లో రూ.40 లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు నేడు శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ చెప్పారు. నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్, క్రీడా పరికరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. సంతపేట గుంటబడికి విశాలమైన ఆట స్థలం ఉందని క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
![]() |
![]() |