గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు సత్యవర్థన్ను విజయవాడ కోర్టుకు పటమట పోలీసులు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుట సత్యవర్థన్ 164 స్టేట్మెంట్ను పోలీసులు వీడియో రికార్డు చేయనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులకు సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు వాపస్ తీసుకోవాలంటూ సత్యవర్థన్కు వల్లభనేని వంశీ నుంచి బెదిరింపుల రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సత్యవర్థన్ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో సత్యవర్థన్ కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 161 కింద అతడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే 164 కింద మరోసారి అతడి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయనున్నారు. అందుకోసం సోమవారం మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో సత్యవర్థన్ను విజయవాడ కోర్టుకు తీసుకు వచ్చారు. అయితే అతడిని మీడియా కంట కనబడనీయకుండా.. కోర్టు వెనుక భాగం నుంచి లోపలికి తీసుకు వచ్చారు. అలాగే అతడి ముఖానికి మాస్క్ సైతం తగిలించారు. మరికొద్ది సేపటిలో మేజిస్ట్రేట్ ఎదుట అతడు వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa