ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ప్రజలని బెంబేలేత్తిస్తున్న జీబీఎస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 07:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో జీబీఎస్ తొలి మరణం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ అనే మహిళ గత రెండ్రోజులుగా గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతోంది. 24గంట క్రితం ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు అక్కడ వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తుండగానే కమలమ్మ చనిపోయింది. మృతురాలి స్వగ్రామం కొమరోలు మండలం అలసందలపల్లి. తీవ్రజ్వరం,కాళ్లు చచ్చుబడిపోవడంతో వింత వ్యాధిగా భావించి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఈ తరహా జబ్బుతో తొలి మరణం సంభవించడంతో అటు జీజీహెచ్ వైద్యులు, ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఈవ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోందని కంగారుపడుతున్నారు. రాష్ట్రంలో 17మందిలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించగా గుంటూరు జీజీహెచ్‌లోనే ఏడుగురు ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa