సబ్బవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేళ్ల క్రితం ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ విశాఖలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది మంగళవారం తీర్పుచెప్పారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.సబ్బవరం మండలం టెక్కలిపాలెం శివారు నాయనమ్మపాలెం గ్రామానికి చెందిన ఎర్ర నవీన్, తనతోపాటు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ఒక బాలికతో పరిచయం వుంది. తరువాత నవీన్ ఐటీఐలో చేరగా, బాలిక ఇంటర్పూర్తి చేసి డిగ్రీలో చేరింది. నవీన్ తరచూ కళాశాలకు వెళ్లి ఆమెను కలుస్తుండేవాడు. కొద్ది రోజుల తరువాత నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లికూడా చేసుకుంటానని చెప్పాడు. అంతేకాక ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. కొద్ది రోజుల తరువాత ఆమె గర్భందాల్చింది. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలని కోరగా, నవీన్ తిరస్కరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బాలిక గర్భవతి కావడానికి నవీన్ కారణమని నివేదిక వచ్చింది. దీంతో అప్పటి దిశ పోలీస్స్టేషన్ అధికారి ప్రేమ్కాజల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి నవీన్కు 20 ఏళ్ల జైలు, రూ.3 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ సొమ్ముతోపాటు ప్రభుత్వం తరపును మరో రూ.7 లక్షలను బాధితురాలికి పరిహారంగా అందించాలని తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలి తరపును పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి వాదనలు వినిపించారు. ఆయనతోపాటు సబ్బవరం పోలీసులను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa