ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీబీఎస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 12:08 PM

గులియన్‌ బారో సిండ్రోమ్‌ (జీబీఎస్‌) వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఎమ్మె ల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి జీబీఎస్‌కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. ముందస్తు జాగ్రత్తలపై వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీబీఎస్‌తో బాధపడేవారి కోసం రాజమహేంద్రవరం బోధనాసుపత్రిలో ఐసోలేషన్‌ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన మందులు, ఇంజక్షన్లు కూడా సిద్ధంగా ఉంచారని అన్నారు. జీబీఎస్‌ సోకితే కండరాల బలహీనత, తిమ్మిర్లు రావడం, కాళ్లు చచ్చుబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. జీబీఎస్‌ కాళ్లలో ప్రారంభమై పైవరకూ వ్యాపిస్తుందని, తిమ్మిర్లు, నడవలేని స్థితి సంభవిస్తుందని, అవువంటి స్థితి కనిపిస్తే వెంటనే ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని ఆయన వెల్లడించారు. సాధారణ జలుబుగా ఈ వ్యాధి ప్రారంభమవుతుందని, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరించారు. ఒక పేషెంట్‌కు ఐదు రోజులపాటు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, బయటి ఈ ఇంజక్షన్‌ ఖరీదు రూ.20,000 వరకూ ఉంటుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చేస్తారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, మరుకుర్తి రవియాదవ్‌, ఆసుపత్రి కమిటీ సభ్యులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa