ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మిర్చి యార్డ్‌కు చేరుకున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 12:09 PM

 తాడేపల్లి నివాసం నుంచి బుధవారం ఉదయం కాన్వాయ్‌లో బయలుదేరిన వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు చేరుకున్నారు. జగన్‌ కోసం భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కాసేపట్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అయితే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తమకు ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని వైసీపీ నేతలు అంటున్నారు.ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు వైఎస్‌ జగన్‌ మద్దతుగా నిలవనున్నారు. జగన్ రాక నేపథ్యంలో మిర్చి యార్డ్‌కు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు వచ్చారు. మిర్చి యార్డ్‌ వద్ద జగన్‌ను కలిసి మాట్లాడారు. అయితే జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఇది సభ, ర్యాలీ కాదని.. రైతులతోనే జగన్ మాట్లాడుతారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మిర్చి యార్డ్‌ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa