ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో దారుణం..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 01:13 PM

డబ్బులివ్వాలని.. లేకపోతే మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఇంజినీరింగ్ విద్యార్థినిని మరో ఇంజినీరింగ్ విద్యార్థి బెదిరించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. సదరు ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు అతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆ విద్యార్థినికి గత కొంత కాలం క్రితం సోషల్ మీడియా వేదికగా మరో ఇంజినీరింగ్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ…. ఆ తరువాత వీరిద్దరూ మాట్లాడుకోవటం లేదు. 
దీంతో విద్యార్థినిపై సదరు యువకుడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు తరచూ ఫోన్ చేస్తున్నాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విద్యార్థినికి తన స్నేహితులతో కూడా ఫోన్ చేయించేవాడు. తాను చేసిన ఫోన్‌కు స్పందించడం లేదని కోపం పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి…. ఆమెకు మెసేజ్‌లు చేశాడు. ఫోటోలను మార్ఫింగ్(నగ్నంగా) చేస్తానని, సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అయితే అలా చేయకుండా ఉండాలంటే… తాను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఇలా తరచూ వేధింపులు… బెదిరింపులతో విసుగు చెందిన ఆ ఇంజినీరింగ్ యువతి…. గుంటూరు అరండల్ పేట పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు… చాకచక్యంగా వ్యవహరించి మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు నలుగురిని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa