ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక కృతజ్ఞతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 04:55 PM

ప్రకృతి విపత్తులకు గురైన రాష్ట్రాలకు కేంద్రం సాయం నేడు నిధులు మంజూరు చేసిన కేంద్ర హై లెవల్ కమిటీ గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హై లెవల్ కమిటీ రూ.608.08 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.ఏపీ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు ప్రకటించిన రూ.1554.99 కోట్లలో ఏపీకి రూ.608.08 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హై లెవల్ కమిటీ ప్రకటనను కూడా పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa