ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏమయ్యా హిమాలయాలకు వెళ్లిపోతావా ఏంటి

national |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 09:55 PM

ఇటీవలే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. ఈరోజు ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్‌గా విజేందర్ గుప్తా.. మంత్రులుగా ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు ప్రమాణం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు.


అయితే ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీ ఈకార్యక్రమానికి వచ్చిన అతిథులతో ఆప్యాయంగా మాట్లాడారు. నవ్వుతూనే ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రేమగా మాట్లాడారు. ఆయన్ను చూడగానే నవ్వుతూ.. ఏంటయ్యా హిమాలయాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటంటూ ప్రశ్నించారు. దీనికి షాకైన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ చూశాడు. కానీ అంతలోనే మళ్లీ ప్రధానియే అందుకుని.. వద్దులే నీవు ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు.


ప్రధాని మోదీ ఇలా మాట్లాడడం చూసి పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు సహా అంతా నవ్వారు. మోదీ కూడా నవ్వుతూనే.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధనేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను వివరించారు. నవ్వుకుంటూనే ఆయన హిమాలయాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేశావా అని అడిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి చూసేసి ఏమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa