ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిలో తప్పతాగి కాల్పులు.. బుల్లెట్ దిగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 08:52 PM

పంజాబ్‌లోని జలంధర్ జిల్లా గొరయా గ్రామంలో వివాహ వేడుక జరుగుతోంది. ఈక్రమంలోనే బంధువులు, స్నేహితులంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అనేక మంది మ్యూజిక్ వింటూ నృత్యాలు చేస్తుండగా.. ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి తుపాకీని బయటకు తీశాడు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే మ్యూజిక్ ఎక్కువగా ఉండడం దీన్నిఎవరూ గమనించలేదు. కానీ అటుగా వెళ్తున్న సర్పంచ్ భర్త 45 ఏళ్ల పరమ్‌జీత్ సింగ్ శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు.


విషయం గుర్తించిన బంధువులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. అయితే పరమ్‌జీత్ శరీరంలో బుల్లెట్ ఉండగా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతుడు పరమ్‌జీత్ భార్య, సర్పంచ్‌యే నేరుగా వచ్చి తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ చెప్పుకొచ్చింది. నిందితుడిని కాపాడేందుకు ఈ వ్యాఖ్యలు చేసింది.


కానీ అతడు కాల్పులు జరిపిన వీడియో కాస్తా వైరల్ కాగా అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా సదరు వ్యక్తి చేసిన ఫైరింగ్ చూస్తుంటే.. సెలబ్రేటరీ ఫైలింగ్‌లా కనిపించడం లేదు. ముందుగా గాల్లోకి ఎక్కుపెట్టిన నిందితుడు ఆపై.. పరమ్‌జీత్ సింగ్ దగ్గరకు రాగానే ఆయన్ను కాల్చాడు. ఈక్రమంలోనే అతడు చనిపోగా.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కావాలనే అతడు చంపాడా, మృతుడి భార్య ఎందుకు అబద్ధం చెప్పిందనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa