ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. కుంభమేళా ప్రారంభం అయి 41 రోజులు గడుస్తుండగా.. మొత్తంగా 60 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజుల్లోనే ఈ మహా కుంభమేళా ముగుస్తుండగా.. మరో 5 కోట్లకు పైగా జనాలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత ఎక్కువ మంది పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదరణ లభించింది. ఎవరూ ఊహించని స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని పుణ్య స్నానాలు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకు వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి.. ఆపై అనేక ఆలయాలను దర్శించుకున్నారు. జనవరి 13వ తేదీన ఈ కుంభమేళా ప్రారంభం కాగా ఈరోజు వరకు మొత్తంగా 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కారు చెబుతోంది. కేవలం 41 రోజుల్లోనే ఇంతమంది రావడం చూసి హర్షం వ్యక్తం చేసింది.
45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాకు కేవలం 45 కోట్ల మంది భక్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగా భావించారు. కానీ రోజుకు కోటికి పైగా భక్తులు వచ్చి యూపీ సర్కారుకు షాక్ ఇచ్చారు. ఇక పండుగల రోజు మరింత ఎక్కువ మంది వచ్చారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ వంటి రోజుల్లో కోట్లలో భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇలా కేవలం 34 రోజుల్లోనే 50 కోట్ల మంది వచ్చి రికార్డు సాధించారు. దీంతో అధికారుల అంచనా తప్పింది.
ఆపై కుంభమేళా ముగిసేసరికి 60 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు యూపీ సర్కారు తెలిపింది. కానీ నాలుగు రోజులకు ముందే ఈ రికార్డు కూడా బ్రేక్ కాగా.. సీఎం యోగి ఆదిత్య నాథ్ హర్షం వ్యక్తం చేశారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోందని పేర్కొన్నారు. మన రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేని వారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా మరో నాలుగు రోజుల్లో 5 కోట్లకు పైగా జనాలు వస్తారని.. శివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంనది భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa