కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైయస్ఆర్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది అని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ..... ప్రతిసారీ గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ అవహేళన చేస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజలకు వారేం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే వైయస్ఆర్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైయస్ జగన్ గారు సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై కోర్ట్ లో కూడా కేసు వేశాం. వైయస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని కూడా గవర్నర్ గారిని కూడా కోరాం. అయినా కూడా ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి, సభ నుంచి బాయికాట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తున్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనూ పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షంకు ఇచ్చాం. గతంలో ఒకే శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారు. కానీ కేవలం ఏపీలోని తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతిపక్షం అనేదే లేకుండా పాలన చేయాలని భావిస్తోంది. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలనలోనే కేవలం అధికార పక్షం మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మనదేశంలో ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తాలిబన్ పాలన సాగిస్తోంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa