ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి ఎయిమ్స్‌ లో సమస్యలని అడిగితెలుసుకున్న పెమ్మసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 08:44 AM

మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన వసతులను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఎయిమ్స్‌లో ఇన్‌ పేషెంట్‌, అవుట్‌ పేషెంట్‌, ఎమర్జెన్సీ, ఆపరేషన్‌ థియేటర్లు, ఇతర విభా గాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎయిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, వైద్యులతో ఆస్పత్రి పురోభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్యం అందుబాటులో ఉందన్నారు. రోజూ 3,200 ఓపీ నమోదవుతోందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నందున ప్రణాళి కాబద్ధమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెడ్స్‌ కాస్త తక్కువగా ఉన్నాయని, అలాగే ప్రజలకు రవాణా సౌకర్యం, బస్సు షెల్టర్లు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించామని, త్వరలోనే వాటన్నింటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌ సీఎస్‌ఆర్‌ ద్వారా రెండు షటిల్‌ బస్సు సర్వీసులను నడిపే ఏర్పాటు చేశారని, ఎన్నికల కోడ్‌ ముగియగానే అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రోగుల సహాయకుల కోసం ధర్మశాల భవనాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రైవేటు అంబులెన్స్‌లు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై కిలోమీటరు చొప్పున నిర్ణీత ధరలతో నడిపేలా బోర్డులు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఉద్యోగులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలపై విచారణ జరి పిస్తామని, క్యాంటీన్ల నిర్వహణ కోసం మరిన్ని టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎయిమ్స్‌ ఈడీ అహంతెమ్‌శాంతా సింగ్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa