పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో అయోమయానికి గురయ్యారు. హాల్ టికెట్లో ఉన్న అడ్రస్ ఒకచోట.. పరీక్ష కేంద్రం మరొకచోట ఉండటంతో ఒకింత విస్మయానికి గురయ్యారు విద్యార్థులు. హాల్ టికెట్లో ఉన్న అడ్రస్ ప్రకారం పరీక్షా కేంద్రానికి వెళ్తే... పరీక్ష కేంద్రం వేరే చోటికి మార్చారనే బోర్డు అక్కడ దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు ఉరుకుల పరుగులతో పరీక్షా కేంద్రానికి పరుగులు తీశారు. పరీక్షా కేంద్రం మార్చారని విద్యార్థులకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇలాంటి స్థితి ఏర్పడింది. అధికారుల తీరు పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పరీక్షా కేంద్రం మార్చడం వల్ల అక్కడకు వెళ్లేలోపు సమయం మించి పోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన పరీక్షల సమయంలో అధికారులు ప్రవర్తించిన తీరు ఏమీ బాగోలేదని, పరీక్ష కేంద్రం మార్పుపై ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులను తల్లిదండ్రులు నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa