ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై జరిగే అఘాయిత్యాలకు వందరోజుల్లో శిక్ష పడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 11:09 AM

మహిళల హత్యలు, అత్యారాలను కట్టడి చేయడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని హోం మంత్రి అనిత అన్నారు. ఇలాంటి నేరాలు చేసేవారికి వందరోజుల్లో శిక్ష పడేలా యంత్రాంగం పనిచేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌, హూమ్‌ సర్టిఫికెట్‌, చార్జీషీట్‌, కోర్టుకు ఆధారాలు సమర్పించడం.. ఇలా మొత్తం ప్రక్రియ వంద రోజుల్లో పూర్తికావాలని అన్నారు. రాష్ట్రం ఎందుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో గంజాయి ఒకటని, గంజాయి ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యం కారణంగా స్కూల్‌ బ్యాగుల్లోకి గంజాయి చేరిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం గంజాయి సాగును అరికడుతోందని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడానికి ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో నిధులు కేటాయించామనిఅన్నారు. తొమ్మిది నెలల కాలంలోనే లక్ష కేజీలపైన గంజాయిని ధ్వంసం చేశామని అన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, వెస్ట్‌ గోదావరి ఇలా పలు జిల్లాల్లో పోలీసు యంత్రాంగం గంజాయి రవాణా జరగకుండా కట్టడి చేసిందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa