ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన నూతన ట్రాఫిక్ నిబంధనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 11:22 AM

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ.. హైకోర్టు ఆదేశాలతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్‌ వాహనాల చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. శనివారం నుంచి విజయవాడ, విశాఖపట్నం లలో అమలు ప్రారంభించారు. విడతలవారీగా జిల్లాలు, గ్రామస్థాయిల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చునే వ్యక్తికి కూడా హెల్మెట్‌ తప్పనిసరి. విశాఖలో గత సెప్టెంబరు నుంచి, విజయవాడలో డిసెంబరు నుంచి హెల్మెట్‌ ధారణపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. దీని ద్వారా అవగాహన పెరిగి, ఎక్కువ మంది హెల్మె ట్‌ ధరిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రా లు, హైవేలపై తనిఖీలు చేపట్టాలని ఎస్పీలకు ఆదేశాలు అందాయి. జరిమానాల సమాచారాన్ని తెలియజేసేలా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa