నేరం చేసినవారికి వంద రోజుల్లో శిక్ష పడేలా పోలీసు యంత్రాంగం పనిచేయాలని హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే గుర్తొచ్చేది పోలీసులేనని అనంతపురం పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో శనివారం ఆమె పాల్గొన్నారు. డీజీపీ హరీ్షకుమార్ గుప్తాతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ‘పోలీసు ఉద్యోగం చేపట్టాక ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు మీ పరిధి చాలా చిన్నది. రేపటి నుంచి చాలా విస్తృతమౌతుంది..’ అని విధుల్లో చేరబోతున్న ఎస్ఐలనుద్దేశించి అన్నారు. పోలీసులు చెప్పే ఒక్క మాటతో బాధితుల కష్టాలు సగం తీరుతాయని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. తనను హోం మంత్రిని చేసిన సీఎం చంద్రబాబు, ఎన్డీఏ కూటమి సభ్యులకు ధన్యవాదాలని అన్నారు. హోం మంత్రిగా ఇలాంటి పరేడ్ మైదానంలో నిలబడాలంటే అదృష్టం, అర్హత, ప్రజల దీవెనలు ఉండాలని అన్నారు. సబ్ ఇనస్పెక్టర్లుగా 394 మంది సమాజంలో అడుగుపెట్టడం అరుదైన అంశమని అన్నారు. పాసింగ్ అవుట్ పెరేడ్లో నిలబడ్డ మిమ్మల్ని చూస్తున్న తల్లిదండ్రుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగి పోతున్నాయని అన్నారు. ఎంటెక్, బీటెక్, ఫార్మసీ, ఆర్ట్స్ అండ్ సైన్స కోర్సులు అభ్యసించిన వారు ఎస్లుగా ఎన్నికయ్యారని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సులు చేసినవారు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా రూ.లక్షల జీతాలు తీసుకోవచ్చని, అయినా ప్రజాసేవ చేయాలనే తపన, పోలీస్ ఉద్యోగం పట్ల ప్యాషనతో ముందుకు వచ్చారని అన్నారు. పోలీసు ఉద్యోగంలోకి రావాలంటే త్యాగం చేయాలని, ఎంత కష్టపడి చదవారో ఆర్థమౌతోందని అన్నారు. పోలీసులు అంటే ఇలా ఉండాలి అనేలా నడుచుకోవాలని సూచించారు. పోలీసులు చేసే తప్పులు, ఒప్పులు ప్రభుత్వం మీద ప్రభావం చూపుతాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa