కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ కుళాయి చెరువులో ఉన్న గోదావరి కళా క్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కుడా చైర్మన్ తుమ్మలబాబు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. జనసేన పార్టీ పదేళ్లపాటు ప్రజల్లో ఉంటూ అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఈ రోజు రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా అవతరించిందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో జనసైనికలు మన పార్టీని కాపాడిన విధానం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కష్టపడి పనిచేసి జెండాను మోసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa