ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో ఆదిమానవుని ఆనవాళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 11:30 AM

 కడప జిల్లా బద్వేలు, సిద్దవటం, మైదుకూరు పరిధిలోని లంకమల అభయారణ్యంలోని కొండల్లో వేల సంవత్సరాల నాటి ఎన్నో చారిత్రక వింతలు, విశేషాలు బయటపడుతున్నాయి. పురావస్తు శాఖ పరిశోధనల్లో నిష్ణాతులైన మునిరత్నం రెడ్డి, యేసుబాబు ఆధ్వర్యంలో గురువారం నుంచి లంమల అడవుల్లో ఓ బృందం పర్యటిస్తోంది. దీనిలో యేసుబాబు బృందం ఆదిమానవుడు ఇక్కడ జీవించినట్లు పలు ఆధారాలను సేకరించింది. మల్లుగాని బండ (గవి) వద్ద రాతియుగం నాటి ఆదిమానవుడు గీసిన జంతువులు, మనుషులను పోలిన కొన్ని రేఖా చిత్రాలను గుర్తించారు. బండిగాని సెల వద్ద ఉన్న ఒక గుహలో ఆదిమానవుని ఆవాసాలు, రే ఖాచిత్రాలు ఉన్నాయి. తెలుపు రంగుతో గీసిన రేఖా చిత్రాల్లో అడవి జంతువులు, ఆహార వ్యవహారాలకు సంబంధించినవి ఉన్నాయి.ఎరుపు రంగుతో వేసిన బొమ్మల్లో గుర్రం, రాజు, సైన్యం, ఖడ్గం వంటి ఆయుధాలు, ఆవులు, ఆవులను కోసే వాళ్లు ఇలాంటి నాగరిక జీవన ప్రమాణ అంశాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగం, త ప్పెట్లు, డోలుతో ఊరేగింపుగా వెళుతున్నట్లు, కొరడా పట్టుకుని పోతురాజులాగా ఉన్న రేఖాచిత్రాలను గమనిస్తే.. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కోణంలో పరిశోధనకు అవకాశాలు కనిపిస్తాయి. కాగా, పురావస్తు శాఖ అధికారి యేసుబాబు తమ మూడవ రోజు పర్యటన వివరాలను ఆంధ్రజ్యోతికి వివరించారు. ‘మూడు రాతి స్థావరాల్లో ఒకదానిలో రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలలో ముఖ్యంగా మనుషుల, జంతువుల రేఖాచిత్రాలున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహలలో ఆదిమ మానవులు సంచార జీవులుగా నివసించే వాళ్లు. ఇక్కడ నీటి వసతి ఉండడంతో.. జంతువులను వేటాడి జీవించే వాళ్లు. వేటాడిన జంతువులను కాల్చుకుని తిన్నారు అనడానికి ఇక్కడ ఆదిమానవుని కాలం నాటి బొగ్గులు దొరికాయి’ అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa