రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, రెవెన్యూ ప్రక్రియలను సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్పమెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏపీ విభాగం స్వాగతించింది. వేగవంతమైన అనుమతులు, పారదర్శకతకు ఇవి దోహదపడతాయని పేర్కొంది. విజయవాడలోని మాలక్ష్మి చాంబర్స్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్కరణల ప్రభావంపై నరెడ్కో ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ మాట్లాడుతూ బిల్డింగ్ నిబంధనల్లో మార్పుల ద్వారా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి జవసత్వాలు ఇచ్చిందన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో ఇసుక పాలసీతో ఎంతో నష్టపోయిన నిర్మాణ రంగం కొత్త ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ వల్ల తిరిగి పుంజుకుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ముందుకురావడం సంతోషకరమన్నారు. రోడ్డు కనీస వెడల్పును 40 నుంచి 30 అడుగులకు తగ్గించడం వల్ల అనధికార లేఅవుట్ల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక పార్కింగ్ను అనుమతించడం వలన ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa