రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో అనుసంధానించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఔటర్ రింగురోడ్డు, జాతీయ రహదారుల సమాహారంతో అమరావతి మరింత శోభాయమానం కానుంది. రూ.16,310 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన అమరావతి ఔటర్ రింగురోడ్డు అలైన్మెంట్కు కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈక్రమంలోనే వినుకొండ- గుంటూ రు హైవే విస్తరణ, నిజాంపట్నం- గుంటూరు హైవే నిర్మాణ పనులు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే వినుకొండ- గుంటూరు రహదారి అలైన్మెంట్కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపగా, నిజాంపట్నం -గుంటూరు రహదారికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా వినుకొండ- గుంటూరు మధ్య విస్తరించ తలపెట్టిన రహదారి పనులు ఊపందుకున్నాయి. రూ.2,605.3కోట్ల అంచనాలతో నాలుగు వరసలుగా ఈ జాతీయ రహదారిని విస్తరించనున్నారు. గుంటూరుకు సమీపంలోని బుడంపాడు వద్ద ఈ రహదారి ఓఆర్ఆర్లో కలుస్తుంది. అక్కడినుంచి రింగురోడ్డు మీదుగా అమరావతికి చేరుకోవచ్చు. 44.8 కి.మీ. మేర బ్రౌన్ఫీల్డ్గా, మరో 40 కి.మీ. మేర గ్రీన్ఫీల్డ్గానూ విస్తరించనున్నారు. వినుకొండ, శావల్యాపురం, సంతమాగులూరు, పెట్లూరువారిపాలెం, సాతులూరు, ఫిరంగిపురం వద్ద ఆరు బైపా్సలు వస్తాయని, వాటికి సంబంధించి కూడా భూ సేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa