ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరుగుతాయని ఎన్నికల అధికారి చిల్లర వెంకట సుబ్బారావు తెలిపారు. ఆదివారం స్థానిక క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఎన్ని కలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గం టల వరకు కొనసాగుతాయని, ఇందుకోసం క్లబ్లో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చే సినట్లు చెప్పారు. ప్రతి బూత్లో ఇద్దరు ప్రి సైడింగ్ అధికారులు ఉంటారన్నారు. షటిల్ కోర్ట్లో ఒకటి, క్యారమ్స్ కోర్టులో ఒకటి పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తామని, మొత్తం 970 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌం టింగ్, రాత్రికి ఫలితాలను వెల్లడిస్తామని చె ప్పారు. అధ్యక్ష పదవికి నలుగురు, ఉపాధ్యక్షు లుగా ఇద్దరు, కార్యదర్శి పదవికి ముగ్గురు. సం యుక్త కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారికి ఆరుగురు, ఈసీ మెంబర్లుగా 12 మంది పోటీ లో ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి ఓటరుకు బ్యా లెట్ పేపర్ ఇస్తామని, తమ వెంట తప్పనిసరిగా ఆధార్కార్డును తీసుకురావాలని పేర్కొన్నారు. అదేవిధంగా పోటీలో 12 మంది ఈసీ మెంబర్లుగా ఉన్నప్పటికీ తమకు నచ్చిన ఆరుగురికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని, అంతకుమించి ఓటు వేస్తే చెల్లద ని తెలిపారు. ఇక ఆరోజు క్లబ్ ఆవరణలోకి ఓటర్లను తప్ప ఇతరులను అనుమతించబోమ ని, ఎన్నికల సందర్భంగా బందోబస్తు కోసం పోలీస్శాఖకు విజ్ఞాపన పత్రం ఇస్తున్నట్లు పే ర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అ భ్యర్ధులు, ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చే శారు. సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులు కనుమాల రాఘవులు, వారణాసి శ్రీనివాసశా స్ర్తి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa