ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోసానిని వదలని కేసులు, నరసారావుపేట పోలీసుల అదుపులో పోసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 12:38 PM

సినీనటుడు పోసాని కృష్ణమురళిపై నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 153 ఏ 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద ఆయనపై కేసు ఫైల్ అయ్యింది. ఈ క్రమంలో పీటీ వారెంట్‌‌తో రాజంపేట సబ్‌ జైలుకు చేరుకున్నారు నరసరావుపేట పోలీసులు. రాజంపేట సబ్‌జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో గత నాలుగు రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. నరసారావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో నరసరావుపేటకు పోసానిని తరలించారు.కాగా.. పోసాని కృష్ణ మురళిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15కు పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్‌జైలుకు దారిపట్టారు. ఇందులో భాగంగా రాజంపేట సబ్‌జైలులో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్‌తో ఈరోజు (సోమవారం) నరసారావుపేట పోలీసులు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గతంలో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. దీంతో నరసారావుపేట పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని నరసారవుపేటకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకు నరసారావుపేట సబ్ జైలులో ఉంచుతారా లేక రాజంపేటకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa