ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెమీస్ లో మరోసారి తలపడనున్న ఇండియా vs ఆస్ట్రేలియా....

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 12:40 PM

 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరాలంటే ముందు సెమీస్‌లో ఆసీస్‌ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది. గతంలో పలు ఐసీసీ ఈవెంట్స్‌లో ఆస్ట్రేలియాను నాకౌట్‌ మ్యాచ్‌లలో ఓడించిన ఘనమైన రికార్డ్‌ టీమిండియాకు ఉంది. కానీ, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో మాత్రం రోహిత్‌ సేన ఆసీస్‌ చేతుల్లో ఓటమి పాలైంది. దానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో కంగారులను ఓడించాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ 2025 మార్చి 4న మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది.  ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డ్‌ చూసుకుంటే టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. రెండు సార్లు టీమిండియా గెలిచింది. చూడాలి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో..  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa