ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక్రమణకు గురైన కాలువను సర్వే చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 04:15 PM

బాపట్ల మండలం నర్సాయపాలెం గ్రామం మాదిగపల్లి సమీపంలో మాన్యాల కాలువ ఆక్రమించడంతో కాలువ దిగువనున్న పొలాలకు నీరు అందటం లేదని స్థానిక రైతులు అన్నారు. ఈ మేరకు సోమవారం బాపట్ల మండల ఎమ్మార్వోని కొంతమంది రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. మాన్యాల కాలవకు దిగువన సర్వేనెంబర్ 386/3 లో గల 43 ఎకరాలకు నీటిపారుదల లేకుండా ఇరువైపులా ఆక్రమణకు గురై ఉందని, ఆక్రమణకు గురైన కాలువను సర్వే చేయించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa