ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహిత అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు

Crime |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 07:58 PM

హైదరాబాద్ మలక్‌పేటలో ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందిందని భర్త.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం తరలించేందుకు ప్రయత్నించాడు. అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.


వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం సమీపంలోని దోమలపెంటకు చెందిన సింగం శిరీష, వినయ్‌ కుమార్‌ దంపతులు. మలక్‌పేట్‌ జమునా టవర్స్‌‌లో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. వినయ్ వ్యాపారి కాగా.. శిరీష గృహిణి. అయితే, నేడు ఉదయం శిరీష గుండెపోటుతో మృతి చెందిదని భర్త వినయ్ కుమార్ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఏం జరిగిందో అర్థం కాక.. ఆవేదనతో శిరీష తల్లిందండ్రులు, బంధువులు హైదరాబాద్ బయల్దేరారు. అయితే వారు నగరానికి చేరకముందే భర్త వినయ్ శిరీష మృతదేహాన్ని ఆమె స్వగ్రామం దోమలపెంటకు తరలించే ప్రయత్నం చేశాడు.


అనుమానం వ్యక్తం చేసిన శిరీష తల్లిదండ్రులు.. ఆమె ఒంటిపై కొట్టిన గాయాలను గుర్తించారు. అల్లుడే తమ కూతుర్ని కొట్టి చంపి ఉంటాడని భావించారు. మతదేహంపై స్పష్టమైన గాయాలు ఉంటే.. గుండెపోటుగా చిత్రీకరించారంటూ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్‌మెంట్‌, హాస్పిటల్ సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిరీష మృతికి భర్తే కారణంగా బంధువులు ఆరోపిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.


ఆస్తి కోసం అమ్మను చంపేసిన యువకుడు ఇక సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్‌లో దారుణం చోటు చేసకుంది. ఆస్తి కోసం కన్నతల్లిపై ఓ కసాయి కొడుకు దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి అనే యువకుడు.. తల్లి రాధిక (52)పై 12 సార్లు కత్తితో దాడి చేశాడు. ఆస్తి తనపేరున రాయాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాధిక చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa