ప్రజలు, పోలీసుశాఖపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీతి, నీజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాకు కేటాయించిన ప్రొబెషనరీ ఎస్ఐలు బి.సాయిరామ్ పడాల్, పి.నాని, కె.సాయిరామ్, కె.దుర్గాప్రసాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నడవడికతో పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. మద్యం, గంజాయికి అలవాటు పడిన యువతను వాటినుంచి దూరం చేసి వారిని సన్మార్గంలో నడిపేందుకు పోలీసుశాఖ కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం విజయనగరంలోని బాబామెట్టలో ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిఅడిక్షన్సెంటర్ పరిశీలించారు. ఈ సం దర్భంగా డిఅడిక్షన్సెంటర్లో చేర్చిన మద్యం, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఔట్పోస్టును సందర్శించి సిబ్బంది పని తీరును పరిశీలించారు.ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపరిడెం టెంట్లు శివ శ్రీధర్, రమణి, పీవోకాళీప్రసాద్, సైక్రియాటిస్టు హేమంత్ మాధవ్, జి.బిందు, సీఐలు లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, సూరినాయుడు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa