సినీ నటుడు పోసాని కృష్ణమురళికి షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని అసభ్యకరంగా మాట్లాడరని ఆదోని మూడో పట్టణ పోలీసులకు జనసేన నేత మలిశెట్టి రేణువర్మ ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకొచ్చారు. ఆదోని కోర్టు జడ్జి సెలవుల్లో ఉండటంతో ఇంచార్జీ కర్నూలు కోర్టు న్యాయాధికారి ముందు పోసానిని హాజరు పరిచారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజు రిమాండ్కు విధించారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ లీగల్ సెల్ నాయకుడు సువర్ణ రెడ్డి ఆరోపించారు. పోసానిని గుంటూరు నుంచి పోలీసులు తరలించే క్రమంలో అతనికి ఆరోగ్యం బాగా లేదని, చేయి, నడుము నొప్పి ఉందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, వీటిపై పోరాటం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2.0 ను తీసుకొస్తారని సువర్ణ రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa