సంతబొమ్మాళి మండలంలో ఉప్పు భూములకు హద్దులు లేవని, ఇది ప్రభుత్వ భూమి అని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నౌపడా ప్రాంతంలో సుమారు ఐదువేల హెక్టార్ల పరిధిలో ఉప్పు భూములు ఉన్నాయి. నౌపడా సాల్ట్ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎస్పీఎల్) 375.64 ఎకరాలకు 2,027 వరకు లీజు పొందింది.
పోర్టు ప్రాంతంలో 12మీటర్ల అత్యవసర రోడ్డు మూలంగా ఆ ప్రాంత పరిధిలో ఉన్న 425 ఎకరాల ఉప్పు భూముల్లో.. ఎన్ఎస్పీఎల్కు సంబంధించిన 375.64 ఎకరాలు పోగా మిగిలిన 50.64 ఎకరాల్లో కొంతమేరకు రోడ్డు సౌకర్యం కల్పించే ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa