ఏపీ శాసన మండలిలో రగడ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మండలి నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. బొత్స ఏం మాట్లాడారో తనకు అర్థం కావడం లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పలు అంశాలను మంత్రులు శాసన మండలిలో ప్రస్తావించారు. శాసన మండలిలో రైతు సమస్యలపై చర్చ జరిగింది. ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయంపై చిత్త శుద్ది లేదని సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ. 20 వేల నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధివిధానాలు ఖరారు చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తాము రైతులను మోసం చేయమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నష్టపరిచిందని అన్నారు. వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరిక్షలు లేవు, పంటల భీమా చెల్లింపులు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa