ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో క్యూఆర్ కోడ్‍‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ.. మంత్రి నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 10:17 PM

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కొత్త రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావించారు. త్వరలోనే క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 29 వేల రేషన్ దుకాణాలను మినీ మార్టులుగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలను తెచ్చి బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


ఇక క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల కోసం డిజైన్లు కూడా సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీచేయనున్నట్లు వివరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని.. ఈ విషయమై సిట్ దర్యా్ప్తు జరుపుతోందని తెలియజేశారు.


పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తరుఫున శాసనసభలో పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులపై నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ పట్నానికి ప్రత్యేకంగా టూరిజం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వివరించారు. పర్యాటక రంగంలో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామన్న నాదెండ్ల మనోహర్.. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు పర్యాటక ప్రాజెక్టులను తెచ్చేందుకు బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలు అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.


వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటకులను తెచ్చేందుకు, వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు 50 వేలకుపైగా హోటల్ గదులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద అన్నవరం, సింహాచలం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని.. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్లు నిధులు తెచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాలను స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa