ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్ల నియామకం త్వరగా పూర్తిచెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 09:17 AM

రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్‌ ప్రాసిక్యూటర్ల నియామకం విషయంలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఆన్‌లైన్‌ ద్వారా తమ ముందు హాజరు కావాలని సీఎ్‌సకు స్పష్టం చేసింది. విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, ఆరు నెలల్లో ఖాళీలను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పార్టీ ఇన్‌ పర్సన్‌ న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపించారు. కోర్టుల అవసరాలకు అనుగుణంగా ప్రాసిక్యూటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ప్రణతి స్పందిస్తూ... ‘పిటిషనర్‌ చెబుతున్న స్థాయిలో ప్రాసిక్యూటర్ల అవసరం ఉండదు. రాష్ట్రంలోని కోర్టుల్లో ఎంతమంది అవసరమో అధ్యయనం చేసేందుకు, వారి నియామకంలో నిబంధనలు రూపొందించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వాటిని నోటిఫై చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. విచారణను వాయిదా వేయాలి’ అని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa