ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అన్నప్రసాదంలో మరో ఐటమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 02:26 PM

తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొండపై ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటమ్‌ను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి స్వామి వారికి నైవేద్యంగా పెట్టి, అనంతరం భక్తులు వడ్డించారు.ఇటీవల టీటీడీ కొత్త బోర్డ్ ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించింది. అయితే.. తిరుమలలో ఎక్కడ కూడా స్వామి వారి కైంకర్యాలలో లోపంలేకుండా.. చూడాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం.. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమలకు వచ్చే భక్తులకు పెద్దపీట వేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే తిరుమలలో వీఐపీలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే చర్యలను తగ్గించి, సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa